విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని శివానగర్ లో నివాసముంటున్న వెంకటలక్ష్మి కు ఆడ పాప పుట్టిందని భర్త ఏడు సంవత్సరాల కిందట వదిలేసి వెళ్లిపోయాడు. ఈ సందర్భంగా ఆ కుటుంబం ఎన్నో కష్టాలకు గురికావడంతో, శ్రీ చౌడేశ్వరి సేవా సమితి సమాచారాన్ని తెలుసుకొని తక్షణ సహాయం కింద 5000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. అదేవిధంగా వెంకటలక్ష్మికి కన్నులు కనపడక ఆపరేషన్ చేయించుకోవడంతో మందులు కూడా తామే ఇప్పిస్తామని హామీ వు ఇచ్చారు. తదుపరి కూతురుని చదివించడానికి బెంగళూరు వాస్తవ్యులు కాసెట్టి వెంకటప్రసాద్ భార్య శశికళ బాధ్యతగా తాను తీసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గడ్డం పార్థసారథి, బీరే శ్రీరాములు పాల్గొన్నారు.