సామాజికవేత్త గడ్డం రాజగోపాల్
విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని వార్డులలో నిరాశ్రయులకు ఎల్లప్పుడూ తాము అండగా ఉంటామని సామాజిక వేత్త గడ్డం రాజగోపాల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం పట్టణంలోని 34వ వార్డులో వారు పర్యటించారు. తదుపరి వార్డుల్లో ఇంటింటా తిరుగుతూ ప్రజల సమస్యలను పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తదుపరి ఆ వార్డులో ఉన్న నిరాశ్రయుల వసతి గృహంలో ఉన్నవారికి భోజన నిమిత్తం తనవంతుగా 20వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. అదేవిధంగా వార్డుల్లో వివిధ కారణాల చేత బాధపడుతున్న తులసి, నారాయణస్వామి,కళావతి,వలి, మౌలాలి,వెంకట సాయినాథ్, సాయి శిరీష, ప్రేమలత, రామ్మూర్తి, చంద్రమోహన్, రామాంజిలను పరామర్శించి, వారికి కూడా ఆర్థిక సహాయాన్ని వారు అందజేశారు. అనంతరం బాధితులు గడ్డం రాజగోపాల్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.