విశాలాంధ్ర – జె ఎన్ టి యుఏ: విశ్వవిద్యాలయంలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఏఎస్ఎఫ్ మాజీ నాయకుడు నారాయణస్వామి, రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్ బాబు, జిల్లా అధ్యక్షుడు ఈ. కుళాయి స్వామి పేర్కొన్నారు. గురువారం నగరంలోని నీలం సంజీవరెడ్డి భవనంలో ఏఐఎస్ఎఫ్ అనంతపురం జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ వసతి గృహాల్లో ఉన్న సరైన వసతులు , నాణ్యమైన ఆహారంలేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని తీసివేసి విద్యార్థులు ఆకలితో అలమటించేలా చేస్తున్నారన్నారు. డిగ్రీ నాలుగు సంవత్సరాలు చేయాలనుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు నిరసనగా ఈనెల 18న కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా మహా ధర్నాను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు హనుమంతు, కార్యవర్గ సభ్యుడు ఉమామహేష్ ఆంజనేయులు, వెంకట నాయక్ వేణు, వంశీ, రాజేష్, చిరంజీవి, సుదీప్, అఖిల్ ,మహమ్మద్ పాల్గొన్నారు.