విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణములోని లక్ష్మీ చెన్నకేశవ పురములో ఇటీవల మోటార్ బైక్ యాక్సిడెంట్ లో బోయ వాల్మీకి నరసింహులు గాయపడి అనారోగ్యానికి గురి కావడం జరిగింది. సమాచారాన్ని అందుకున్న 26వ వార్డు టిడిపి నాయకుడు నియోజకవర్గ వాల్మీకి సాధికార కమిటీ ఉపాధ్యక్షుడు టైలర్ గోపాల్ నియోజకవర్గ టిడిపి అభ్యర్థి పరిటాల శ్రీరామ్ ఆదేశాల మేరకు ఐదువేల రూపాయల నగదును సహాయాన్ని అందించి మానవతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.