విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ పరిధిలోని, సచివాలయం 5 నందు శుక్రవారం జరిగిన ఁజగనన్న సురక్షఁ కార్యక్రమానికి నియోజకవర్గ శాసనసభ్యులు మాలగుండ్ల శంకర నారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొని వారి చేతుల మీదుగా ప్రధాన ధృవీకరణ పత్రాలను లబ్ధి దారులకు పంపిణీ చేసారు. ఆయన మాట్లాడుతూ జగన్ అన్న సురక్ష కార్యక్రమం ప్రజలకు అన్ని రకాల ధ్రువపత్రాలు ఇంటి వద్దకే చేర్చుటకు ఈ జగనన్న సురక్ష కార్యక్రమం ఏర్పాటు చేశామని వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీటీసీ, ఎంపిపి, ఎంపిటిసిలు, మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్, టౌన్ కన్వీనర్, వైస్ చైర్మన్, ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు, కౌన్సిలర్స్, కార్యకర్తలు, సచివాలయం కన్వీనర్, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, గృహ సారథులు, తదితరులు పాల్గొన్నారు.