విశాలాంధ్ర- ధర్మవరం : మున్సిపల్ చైర్మన్ కాచర్ల లక్ష్మి శుక్రవారం పట్టణములోని సాయి నగర్ లో వెలసిన శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో బాబా దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ..అర్చకుల ద్వారా వేదమంత్రాలతో చైర్మన్కు స్వాగతం పలికి, వారి పేరున ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం చైర్మన్ కాచెర్ల లక్ష్మిని ఘనంగా సన్మానించిన తర్వాత ఆలయం తరఫున ఆలయ కమిటీ అధ్యక్షుడు సూర్య ప్రకాష్, ఆలయ కమిటీ సభ్యులు జ్ఞాపికను వారు అందజేశారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ పట్టణంలోనే ప్రసిద్ధిగాంచిన బాబా గుడి ఇది అని, ప్రతిరోజు నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందించదగ్గ విషయమని తెలిపారు. అంతేకాకుండా ఎంతోమంది పేద విద్యార్థులకు ఆలయ కమిటీ తరఫున సేవా కార్యక్రమాలతో పాటు, చదువును దృష్టిలో ఉంచుకొని వేల రూపాయలను ఆర్థిక సహాయాన్ని అందజేయడం పట్ల ఆలయ కమిటీ వారిని వారు అభినందించారు. తన వంతుగా కూడా ఆలయ అభివృద్ధికి పాటుపడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.