విశాలాంధ్ర- ఆస్పరి : ఖరీఫ్ రబీ సీజన్లలో రైతులు వేసిన పంటలను వ్యవసాయ, రెవిన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎలాంటి లోపాలకు తావివ్వకుండా పారదర్శకంగా ఈ క్రాప్ బుకింగ్ నమోదు చేయాలని సొసైటీ చైర్మన్ కట్టెల గోవర్ధన్, వ్యవసాయ సలహా మండలి కమిటీ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం రైతు భరోసా కేంద్రం నందు ఎంపీఈవోలు రైతులతో సమీక్ష సమావేశాన్ని వ్యవసాయ అధికారి నరేంద్ర కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సీజన్ వర్షాభావం తక్కువ ఉన్నందున రెడ్ సాయిల్ నందు పత్తి పంటలు వేయకుండా, కందులు, జొన్నలు, సద్దలు ఆముదము మొదలైన పంటలను వేసుకునే విధంగా రైతులకు సూచన ఇవ్వాలని మండల ఎంఈఓలకు సూచించారు. మండలంలోని ప్రతి ఒక్క రైతు తప్పనిసరిగా ఈ క్రాపింగ్ బుకింగ్ నమోదు చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు ప్రకాష్, రాధాకృష్ణ, పుటకలమర్రి సర్పంచ్ శివారెడ్డి, విజయ్ కుమార్, మల్లేష్, హార్టికల్చర్ అసిస్టెంట్ జ్యోతిర్మయి, అనిల్ నాయుడు, రైతులు ఆయా గ్రామాల ఎంపీఈవోలు పాల్గొన్నారు.