విశాలాంధ్ర-తాడిపత్రి : పట్టణంలోని కాల్వ గడ్డ వీధిలో ఉన్న శ్రీ చైతన్య టెక్నో పాఠశాల యందు విద్యార్థినీ విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది కలసి పాఠశాల అధినేత డాక్టరు. బి.యస్. రావుకు అశ్రునివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ చైతన్య విద్యాసంస్థల అధినేత డాక్టర్ బి ఎస్ రావు మరణ వార్త వినగానే కన్నటిపర్యంతమయ్యామన్నారు. డాక్టర్ బి.యస్.రావు స్వాతంత్య్ర దినోత్సవం 15వ తేదీ ఆగస్టు 1947లో జన్మించినారు. ఆయన తన 76 సంవత్సరాల జీవితంలో ఎంతోమందికి ఉపాదిని కల్పించడమే కాక విద్యార్ధినీ విద్యార్థులు ప్రస్తుత పోటి ప్రపంచంలో నెగ్గుకురావడానికి అవసరమైనటువంటి విద్యా ప్రణాళిక్లను ఏర్పాటు చేశారు. విద్యార్థినీ విద్యార్థులకు తమ యొక్క విద్యాసంస్థల ద్వారా విలువలతో కూడిన విద్యను అందించి వారి యొక్క మేధోశక్తిని పెంపొందించి వారు ఉన్నత స్థానంలో స్థిర పడేవిధంగా కృషి చేశారు. ఈయన ఈనెల 13వ తేదీన అనారోగ్య కారకంగా మరణించడం జరిగింది. వీరియొక్క ఆత్మను శాంతి కలగాలని తాడిపత్రి శ్రీ చైతన్య పాఠశాలలో సంతాప సభను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఏజీఎం సుబ్బారెడ్డి, ప్రిన్సిపు బాంబు, డీన్ నాగార్జున, ఇన్చార్జి నాగరాజు, భోధన భోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.