విశాలాంధ్ర – కర్నూల్ సిటీ: జిల్లాలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు పారిశ్రామిక శిక్షణ సంస్థల్లో 2023- 24 విద్యా సంవత్సరం 2వ విడత ప్రవేశాలకు అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ప్రవేట్ ఐటిఐ కళాశాలల మేనేజ్మెంట్ రాష్ట్ర అసోసియేషన్ ప్రెసిడెంట్ దామోదర్ చౌదరి, జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆదినారాయణలు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.జులై14 నుంచి 31వ తేదీ వరకు ఐటిఐ.ఏపీ.గవర్నమెంట్.ఇన్ వెబ్ సైట్ నందు అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.10 వ తరగతిలో ఉత్తీర్ణులతోపాటు ఇంటర్, డిగ్రీ పాస్ లేదా ఫెయిల్ అయిన విద్యార్థిని విద్యార్థులు కూడా అర్హులేనన్నారు.మహిళా అభ్యర్థులకు ప్రతి ట్రేడ్ నందు 33 శాతము రిజర్వేషన్ కలదని, పూర్తి వివరములకు తమ సమీప ప్రభుత్వ మరియు ప్రైవేటు ఐ టి ఐ ల యందు సంప్రదించాలన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థిని విద్యార్థులు సద్వినియం చేసుకోవాలని వారు పేర్కొన్నారు.