విశాలాంధ్ర -ధర్మవరం: పట్టణములోని ఎస్ఎల్వి మార్కెట్లో గల సుబ్రహ్మణ్యేశ్వర నాగుల కట్టపై వెలసిన ఆలయంలో కృత్విక ఉత్సవం అంగరంగ వైభవంగా కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు నిర్వహించారు. అర్చకులు మాట్లాడుతూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మ నక్షత్రమైన ఆషాడ ఆడి కృత్తిక ను పురస్కరించుకొని ఈ ఉత్సవాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ ఉత్సవములో స్వామివారికి క్షీరాభిషేకంతో పాటు సుప్రభాత సేవలు కూడా చేయడం జరిగిందన్నారు. అనంతరం కార్యక్రమానికి వచ్చిన భక్తుల చేతుల మీదుగా స్వామివారికి పాలు పోసే అవకాశాన్ని కూడా అర్చకులు కల్పించారు. తదుపరి రుద్రాభిషేకం తో పాటు సంతాన వన పూజ నిత్యార్చన పుష్పాభిషేకం చేశారు. ఆలయ కమిటీ అర్చకులు మాట్లాడుతూ త్వరలో 20 లక్షలతో రతమును ఏర్పాటు చేయనున్నట్లు వారు తెలిపారు. ఈ రథోత్సవానికి విరాళాలు ఇచ్చిన దాతలు కూడా సత్కరించే కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు వారు తెలిపారు. ఈ ఉత్సవ వేడుకల్లో అధిక సంఖ్యలో భక్తాదులు పాల్గొన్నారు.