విశాలాంధ్ర, కదిరి : వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తలు డా. సంపత్ కుమార్, డా.ప్రసన్న రాజేష్, డా. వేమన, డా. చెండ్రాయుడు, డా నీలిమ, డా.వెంకటరమణ లను జిల్లా వ్యవసాయ సలహా బోర్డు చైర్మన్ ఏ.రమణారెడ్డి ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది కదిరి పరిశోధన స్థానానికి జాతీయ స్థాయిలో ఉత్తమ వేరుశనగ పరిశోధన విత్తనాభివృద్ధి సంస్థగా జాతీయ వ్యవసాయ మండలి అవార్డు ప్రకటించడం ఎంతో ఆనందంగా ఉందని జిల్లా రైతాంగ తరఫున ప్రత్యేక అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో రైతన్నల కోసం తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందే నూతన వంగడాలను ఉత్పత్తి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు సత్యనారాయణ, మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసులు రెడ్డి, మండల బోర్డు చైర్మన్ వెంకటనారాయణ రెడ్డి పాల్గొన్నారు.