న్యూదిల్లీ : దిల్లీలో వరదబాధితులకు సీపీఐ అధ్వ ర్యంలో మంగళవారం ఆహార పొట్లాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జైత్పూర్లోని వరద బాధితులకు సీపీఐ దిల్లీ స్టేట్ కౌన్సిల్, దక్షిణ దిల్లీ జిల్లా శాఖ అధ్వర్యంలో ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సీపీఐ జాతీయ కార్యదర్శులు కె.నారాయణ, రామకృష్ణ పాండా, దిల్లీ స్టేట్ కౌన్సిల్ సభ్యులు బబ్బన్కుమార్ సింగ్, దక్షిణ దిల్లీ జిల్లా నాయ కులు ముస్లిం మహ్మద్, శైలేంద్ర మాలాకర్, ఏఐఎస్ఎఫ్ నాయకుడు శివారెడ్డి తదితరులు నాయకత్వం వహించారు. కాగా ఆహారం, సహాయ సామగ్రిని పంపిణీ చేస్తున్న ప్పుడు వరద బాధితులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టారు. వరద ముంపుతో పాటు బురదమయమైన రోడ్లు, తాగునీరు, పాల సరఫరా మొదలైన సమస్యలను నేతల దృష్టికి తెచ్చారు. ఈ ప్రాంతంతో పాటు దిల్లీలోని ఇతర వరద ప్రభావ ప్రాంతాల్లో తక్షణమే యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు చేపట్టాలని, వరద బాధితులందరికీ తగిన నష్టపరిహారం అందించాలని దిల్లీ ప్రభుత్వాన్ని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు.