ప్రత్యేక అధికారి చాంద్ బాషా
విశాలాంధ్ర- ధర్మవరం : ప్రజా సమస్యల కొరకే జగనన్న సురక్ష కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోందని ఆ కార్యక్రమాలను గ్రామ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకున్నప్పుడే ఫలిత ఉంటుందని ప్రత్యేక అధికారి చాంద్ బాషా, జిల్లా నోడల్ అధికారి శివారెడ్డి, ఎంపీడీవో సౌజన్యకుమారి విస్తరణాధికారి మమతా దేవి తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం మండల పరిధిలోని తుమ్మల గొట్లూర్ గ్రామాలలో జగనన్న సురక్ష కార్యక్రమాలను నిర్వహించారు. తుమ్మలలో సర్పంచ్ ఈశ్వరమ్మ, పుల్లమ్మ ఉప సర్పంచ్ దివాకర్ రెడ్డి, ఎంపీటీసీ చెన్న కృష్ణమ్మ గొట్లురు సర్పంచ్ రమాదేవి, ఆధ్వర్యంలో జరిగింది. గత ఏడు రోజులుగా వాలంటీర్లు సచివాలయ సిబ్బంది ప్రజా ప్రతినిధులు అందరూ కలిసి ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న 11 రకాల సర్వీసులను గూర్చి వివరించడం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా తుమ్మలలో మండల ప్రత్యేక అధికారి చాంద్ బాషా, డి ఎల్ డి వో శివారెడ్డి, విస్తరణాధికారి మమతా దేవి, ఎంపీడీవో సౌజన్యకుమారి చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందజేశారు. తుమ్మలలో 912 సర్వీసులను పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా గొట్లూరు లో1,191 సర్వీసులను పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోట్లురు మారుతి, పిట్టా నరసింహులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి జ్యోతి, మురళి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.