విశాలాంధ్ర,సీతానగరం:అన్ని వర్గాల కుటుంబ సభ్యుల అవసరాలను గుర్తించి వారికి జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా మేలు చేకూర్చడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమనితహశీల్దార్ ఎన్వీ రమణ,
ఈఓపిఆర్డీ వర్మలు తెలిపారు.గురువారం మండలంలో లక్ష్మీపురం గ్రామసచివాలయంలో జరిగిన జగనన్న సురక్ష క్యాంపు కార్యక్రమము జరిగింది..జగనన్న సురక్ష క్యాంప్ ద్వారా అర్జీ పెట్టుకున్న అర్హులకు మంజూరు కాబడిన 11రకాల సేవలకు చెందిన దృవీకరణ పత్రాలను ఎంపిపి ప్రతినిధి బలగ శ్రీరాములు నాయుడు, జెడ్పీటీసీ బాబ్జి, మండల పార్టీ అధ్యక్షుడు బొంగు చిట్టిరాజు స్థానిక ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా ఆర్జీదారులకు అందజేసారు. ఈకార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సత్యవతి , రాధాకృష్ణ, ఎంపీటీసీ,తహశీల్దార్ ఎన్వీ రమణ, ఈఓ పిఆర్డీ వర్మ,ఎంఈఓ-2 మువ్వల వెంకట రమణ, ఆర్ డబ్ల్యు ఎస్ జేఈ పవన్,సచివాలయం సెక్రటరీ వెంకట నాయుడు,ఉద్యోగులు, వాలంటీర్లు, సచివాలయం కన్వీనర్లు, గృహసారథులు,నాయకులు, స్థానిక ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.