విశాలాంధ్ర-గుంతకల్లు : పట్టణంలోని పదవ వార్డు కౌన్సిలర్ ఎద్దుల విజయలక్ష్మి ఆధ్వర్యంలో శుక్రవారం జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మాజీ పట్టణ అధ్యక్షులు ఎద్దుల శంకర్ అధ్యక్షతన వహించారు. ముఖ్య అతిథులు గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకట్రాంరెడ్డి ,మున్సిపల్ కమిషనర్ వి. మల్లికార్జున పాల్గొన్నారు. అనంతరం జగనన్న సురక్ష సంక్షేమ పథకంలో కొత్త రేషన్ కార్డులు, కుల , ఆదాయ ధ్రువీకరణ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వై. వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత నాలుగు సంవత్సరాలుగా క్షేత్రస్థాయిలో ప్రజలకు సంక్షేమ పథకాలు అదే విధంగా అనేక కార్యచరణతో ప్రజలకు అందించారు. అయితే అరకురా సంక్షేమ పథకాలు పొందని లబ్ధిదారులకు జగనన్న సురక్ష పథకం ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాలు చేరువ చేసేందుకు జగనన్న సురక్ష ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని ప్రతి ఒక్క లబ్ధిదారులు సురక్ష పథకం ద్వారా సద్వినియోగం చేసుకోవాలని వార్డు ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.