విశాలాంధ్ర – జె ఎన్ టి యు ఏ: సంక్షేమ వసతి గృహాల్లో కనీస మౌలిక సదుపాయాల నిర్లక్ష్యం, విద్యకు హక్కు చట్టం అమలు , ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో దోపిడి నిర్మూలనకు ఈనెల 25 న రాష్ట్రవ్యాప్తంగా కేజీ నుండి పీజీ వరకు ఏఐఎస్ఎఫ్, టిఎన్ఎస్ఎఫ్, ఎన్ ఎస్ యు ఐ, ఏఐఎస్ఐఏ, ఏఐవైఏ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఐక్య విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. శుక్రవారం నీలం రాజశేఖర్ రెడ్డి భవనంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పాత్రికేయ సమావేశం నిర్వహించారు. అనంతరం ఐక్య విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ.. కేజీబీవీ, గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక , వార్డెన్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయాలకు నిధులు కేటాయింపు, జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం కల్పన, పరిశోధన కేంద్రాలు ఆధునికరణ, డిగ్రీ కోర్సులో పాత విధానం, కేంద్రీయ విశ్వవిద్యాలయానికి నిధులు మంజూరు అంశాలపై నిర్లక్ష్తపై ప్రభుత్వానికి నిరసన తెలియజేయునట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి భావితరాలకు భవితకు బాసటగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి రమణయ్య, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఉమా మహేష్, వంశీ, ఆనంద్, విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు.
01.. మాట్లాడుతున్న ఐక్య విద్యార్థి సంఘం నాయకులు