Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

సిట్టింగులకు ఐ ప్యాక్‌ గండం

. అక్టోబరులో జగన్‌ చేతికి నివేదిక
. 18 మందికి సీట్లు గల్లంతు?
. సీఎం సొంత జిల్లాలో ఇద్దరికి నో
. తెరపైకి వారసులు

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలలో ఆందోళన మొదలైంది. ఐ ప్యాక్‌ సర్వే అక్టోబరు నాటికి పూర్తవుతుంది. ఈ సర్వే ఎలా ఉంటుందనే భయం సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు పట్టుకుంది. ఇప్పటికే తాడేపల్లి కేంద్రంగా నియోజకవర్గ, ప్రాంతీయ సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలతో పార్టీ అధినేత, సీఎం జగన్‌ పదేపదే సమీక్షలు నిర్వహించారు. పనితీరు మెరుగుపరుచుకోవాలని హితబోధ చేశారు. ప్రజల్లోకి వెళ్లని ఎమ్మెల్యేలకు టికెట్‌ ఇవ్వలేనని నిర్మొహమాటంగా చెప్పారు. జగన్‌ నేరుగా చెప్పడంతో చాలామంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల జరిగిన సమావేశంలో పనితీరులో వెనుకబాటుకు గురైన ఎమ్మెల్యేలంతా తనను కలవాలని సీఎం జగన్‌ సూచించారు. అందులో ఎంతమంది సీఎంను కలిశారో…లేదో తెలియదు. మరో తొమ్మిది నెలల్లో ఎన్నికలు రానున్నాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించడంతో అధికార పక్షంలో టికెట్ల హడావుడీ మొదలైంది. వైసీపీలో ఒక్కో నియోజకవర్గానికి సిట్టింగ్‌ ఎమ్మెల్యేతోపాటు ఆయనకు సమాంతరంగా ఎమ్మెల్సీగానీ, నామినేటెడ్‌ పదవి పొందిన నేతగానీ ఉన్నారు. ఎమ్మెల్యే పార్టీ ఫిరాయిస్తే వెంటనే మరొకర్ని తెరపైకి తెచ్చేలా జగన్‌ వ్యూహం రచించారు.
సీఎం జగన్‌ అమలు చేస్తున్న గడప గడపకు మన కార్యక్రమంలో హాజరైన ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జుల పనితీరుపై ఐ ప్యాక్‌ బృందం 175 నియోజకవర్గాలలో సర్వే చేస్తోంది. వాటిని సమన్వయకర్తల సమావేశానికి ముందు జగన్‌కు అందిస్తోంది. అందుకు అనుగుణంగా వెనుకబడిన ఎమ్మెల్యేలను సీఎం అప్రమత్తం చేస్తున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే గ్రాఫ్‌కు సంబంధించి అక్టోబరులో ఐ ప్యాక్‌ తుది నివేదిక ఇవ్వనున్నట్లు తెలిసింది. వారి నివేదిక ఆధారంగా సిట్టింగ్‌లలో 18 మందికి సీటు లేనట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయానికి ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది. పనితీరులో వెనుకబడిన ఎమ్మెల్యేలంతా మెరుగుపడాలంటూ సీఎం ఎప్పటికప్పుడు ఆదేశిస్తున్నప్పటికీ కొంతమంది సీనియర్లు ఖాతరు చేయడం లేదు. మరో నాలుగు నెలల్లో అభ్యర్థుల తుదిజాబితా సిద్ధం కానుందని సీఎం జగన్‌ ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. గెలిచే వారికే టికెట్లు అంటూ పదేపదే చెబుతున్నారు. పనితీరు మెరుగుపర్చుకోని కొందరి పేర్లు సోషల్‌ మీడియా వేదికగా విస్తృతంగా ప్రచారం కొనసాగుతోంది. చాలామంది ఎమ్మెల్యేలు పనితీరులో వెనుకబాటుకు గురవ్వడంతో వ్యూహాత్మకంగా వారసులను తెరపైకి తెస్తున్నారు.
పనితీరులో వెనుకబాటుతోపాటు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సిట్టింగ్‌ల సీట్లు గల్లంతయ్యే పరిస్థితులున్నాయి. ఇందులో గడపగడపకు మన కార్యక్రమాన్నే ప్రధానంగా చూస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక మాజీ మంత్రికి మరోసారి టికెట్‌ ఇస్తారా…లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. గడప గడపలో ఆయన వెనుకబడి ఉండటం, జగన్‌ నుంచి అనేకసార్లు హెచ్చరించినా ఆయన పట్టనట్లు ఉన్నారని సమాచారం. ఈ జిల్లాలోనే మరో ఎమ్మెల్యేకు సీటు దక్కదనే వార్తలున్నాయి. ఇక్కడి నాలుగు రిజర్వుడు స్థానాల్లోనూ వైసీపీ ఎమ్మెల్యేలకు గడ్డు పరిస్థితులున్నాయి. విశాఖ జిల్లాలో ఐదు నుంచి ఆరుగురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్ల కేటాయింపుపై అనుమానాలున్నాయి. వారిపై ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉంది. నెల్లూరు జిల్లాలోనూ సిట్టింగ్‌ల టికెట్లకు ఎసరు తప్పదంటున్నారు. ఇప్పటికే ముగ్గురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పార్టీకి దూరమయ్యారు. వారి స్థానాల్లో వైసీపీ ప్రత్యామ్నాయంగా సమన్వయకర్తలను నియమించింది. ఉమ్మడి చిత్తూరులో ఈ విడత ఎంతమంది సిట్టింగ్‌లకు సీట్లు ఇస్తారనే దానిపై పార్టీ కేడర్‌లో ఆందోళన మొదలైంది. విజయనగరం జిల్లాల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు సిట్టింగ్‌లకు సీట్లు గల్లంతే. శ్రీకాకుళం జిల్లాలోనూ ఇద్దరు లేదా ముగ్గురికి మళ్లీ సీట్లు వచ్చే పరిస్థితుల్లేవు. ఉమ్మడి కృష్ణాజిల్లాలో నాలుగు సీట్లను మార్చనున్నట్లు తెలిసింది. ప్రకాశం జిల్లాలోని సిట్టింగ్‌లలో ముగ్గురిని మార్చే అవకాశముంది. ఉమ్మడి అనంతపురం జిల్లాల్లోనూ ముగ్గురు సిట్టింగ్‌లకు ఎసరు పడనుంది. కడపలోనూ ఒకటి, రెండు సీట్లను మార్చాలనే ఆలోచనతో అధినేత ఉన్నట్లు సమాచారం. ఉమ్మడి గుంటూరు జిల్లాలో గ్రూపు విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. చాలామంది కొత్త వారు టికెట్ల రేసులో ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లాలోనూ ఒకరు లేదా ఇద్దరు సిట్టింగ్‌లను మార్పు అనివార్యమనే ప్రచారముంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒకరిద్దరు సిట్టింగ్‌లకు సీటు దక్కే అవకాశం కనిపించడం లేదు. దీంతో ఎవరికి టికెట్లు దక్కుతాయో తెలియని పరిస్థితిలో ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. తుది జాబితా ఖరారయ్యే నాటికి పనితీరు మెరుగుపర్చుకునే సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను యథాతథంగా కొనసాగించడం, లేకుంటే ప్రత్యామ్నాయంగా కొత్త వారి పేర్లను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మొత్తంగా ఎన్నికలకు 9 నెలల ముందే సిట్టింగ్‌లకు సీట్ల టెన్షన్‌ మొదలైంది. చివరి దశలో సీటు రాకుంటే తమ రాజకీయ భవిష్యత్‌ ఏమిటనే సందిగ్ధంలో సిట్టింగులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img