విశాలాంధ్ర- కర్నూల్ సిటీ : నగరం మేయర్ ప్రాతినిధ్యం వహిస్తున్న 19వ వార్డు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ కాలనీ కొట్టాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఐ నగర కార్యదర్శి పి రామకృష్ణారెడ్డి కమీషనర్ ఏ భార్గవ్ తేజను కోరారు. సోమవారం నగర పాలక సంస్థ కౌన్సిలర్లు నిర్వహించిన స్పందన కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి పి రామకృష్ణారెడ్డి,సహాయ కార్యదర్శిలు శ్రీనివాసరావు మహేష్, నగర కార్యవర్గ సభ్యులు గిడ్డమ్మ, నల్లన్న,కొట్టాల శాఖ కార్యదర్శి కుమార్ కాలనీ ప్రజలతో కలిసి కమిషనర్ కు వినతిపత్రం అందజేశారు.ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ కాలనీ పార్క్ స్థలాలలో కొట్టాలు వేసుకొని 20 సంవత్సరాల నుండి జీవనం కొనసాగిస్తున్నారని, కరెంటు మీటర్లు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డులు అన్నీ ఉన్నాయని,ఇక్కడ నివసిస్తున్న ప్రాంతంలో రోడ్లు,మురికి కాలువలు, మంచినీటి సౌకర్యం కల్పించి,ఇంటి పన్నులు వేయాలని వారు కమిషనర్ కు వివరించారు.తాగునీటి సమస్యతో పాటు మురికి కాలువలు ఏర్పాటు చేయాలని టెలికాం డిపార్టుమెంటు ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీకి చెందిన మహేశ్వర రావు, డ్రైనేజీ సమస్య కారణంగా ఏర్పడిన దోమలు పందుల బెడద సమస్యను పరిష్కరించాలని పందిపాడు కు చెందిన షేక్ అల్లావుద్దీన్, తాగునీటి సమస్యను పరిష్కరించాలని రోజా వీధికి చెందిన రాజు, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ కాల్ నుండి శ్రీరామ నగర్ కు రోడ్డు అనుసంధానం చేయాలని, డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని రాజన్న, నాగరాజు, మౌలిక సదుపాయాలు కల్పించాలని జగన్నాథ గట్టు హౌసింగ్ కాలనీ చెందిన పింజరి సుభాన్ భాషలు కమిషనర్ కు అర్జీలు అందజేశారు. పందిపాడు వివిఎస్ ఫంక్షన్ హాల్ లైన్ లో దోమలు పందుల బెడద అధికంగా ఉందని మరి కాలువలు ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని మహబూబ్ బాషా కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. స్పందనలో స్వీకరించిన అర్జీలను పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించామని, చతురస్థాయిలో పరిశీలించిన అనంతరం సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు.అడిషనల్ కమీషనర్ పి. వీ. రామలింగేస్వర్, ఎస్.ఈ.. వేణుగోపాల్, ఇంచార్గ్ సిటీ ప్లానర్ మోహన్ కుమార్ గారు, ఎం.హెచ.వో. విశ్వేశ్వర రెడ్డి, సానిటరీ సూపర్వైజర్ నాగరాజు గారు, మేనేజర్ చిన్నరాముడులు పాల్గొన్నారు.