విశాలాంధ్ర – పెనుకొండ : పెనుకొండ మండలానికి నూతన వ్యవసాయ అధికారిగా కదిరి డివిజన్లో పనిచేయుచున్న శంకర్ నాయక్ ని జిల్లా వ్యవసాయ అధికారి వై వి సుబ్బారావు బదిలీ చేయడం జరిగింది. ఆయన మంగళవారం మండల వ్యవసాయ అధికారిగా బాధ్యతలు స్వీకరిస్తూ రైతు భరోసా కేంద్రం సిబ్బందితో సమావేశం నిర్వహించి ప్రస్తుతం అమల్లో ఉన్న వ్యవసాయ శాఖ పథకాల గురించి చర్చిస్తూ ఇప్పటి వరకు పీఎం కిసాన్ ఈ కేవైసీ చేయించుకోని రైతులకు ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలనిఅలాగే రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు.