విశాలాంధ్ర, సీతానగరం: మండలంలోని పెదంకలం గ్రామపంచాయతీలో బుధవారం గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ఎమ్మెల్యే జోగారావు ఆద్వర్యంలో జరిగింది. గడప గడపకు వెళ్ళి వారికి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరించి, వారికి ఇంకా ఏమి కావాలని అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.ఈకార్యక్రమంలో ఎంపిపి బలగ రవనమ్మ,జెడ్పీటీసీ మామిడి బాబ్జీ, ఎంపీపీ ప్రతినిధి బలగ శ్రీరాములు నాయుడు, పార్టీ అధ్యక్షులు బొంగు చిట్టిరాజు, సర్పంచులు బలగ శ్రీనివాసరావు, గునుపూరు అన్నం నాయుడు,మూడడ్ల ఉమామహేశ్వరరావు, ఎంపిడిఓ ప్రసాద్,ఎంఈఓ సూరిదేముడు, సెక్రటరీలు గౌరీశ్వరి, శ్రీనివాసరావు, సోమేశ్వరరావు,మండల నాయకులు అంబటి కృష్ణమూర్తి, పోల ఈశ్వర నారాయణ, ఆర్వీ పార్థసారథి,ఎం రామకృష్ణ, మర్రాపు ధనుంజయ, రెడ్డి అప్పల నాయుడు, పోల బలరాం, కురమానశ్రీనివాసరావు, సురగాల కిరణ్, డైరెక్టర్ ఎస్ తిరుపతిరావు, సచివాలయం ఉద్యోగులు, వాలంటీర్లు, సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.