విశాలాంధ్ర,సీతానగరం : అన్ని వర్గాల కుటుంబ సభ్యుల అవసరాలను గుర్తించి వారికి జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా మేలు చేకూర్చడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని మండల ప్రత్యేక అధికారి, డ్వామా పిడి కె.రామచంద్రరావు తెలిపారు.గురువారం మండలంలోని రంగమ్మపేట, ఆర్ వెంకమ్మపేట గ్రామసచివాలయంలలో జరిగిన జగనన్న సురక్ష క్యాంపు కార్యక్రమము జరిగింది. ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.జగనన్న సురక్ష క్యాంప్ ద్వారా అర్జీ పెట్టుకున్న అర్హులకు మంజూరు కాబడిన 11రకాల సేవలకు చెందిన దృవీకరణ పత్రాలను ఎంపిపి, జెడ్పీటీసీ , పార్టీ అధ్యక్షుడు, సర్పంచుల చేతుల మీదుగా ఆర్జీదారులకు అందజేసారు.కులధృవీకరణ,ఆదాయ,జనన, కుటుంబ , మరణ ధృవీకరణ, కొత్త రైస్ కార్డులు, వివాహా ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఈకార్యక్రమంలో జగనన్న సురక్ష కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశంను ప్రజలకు తహశీల్దార్ ఎన్వీ రమణ, ఎంపిడిఓ ఎం ఎల్ ఎన్ ప్రసాదు లు తెలిపారు.ఈకార్యక్రమంలో జడ్పీటీసీ మామిడి బాబ్జీ, ఎంపీపీ ప్రతినిధి బలగ శ్రీరాములు నాయుడు, పార్టీ అధ్యక్షులు బొంగు చిట్టిరాజు, సర్పంచులు బొంగు భాస్కర రావు, ఉడమల విజయలక్ష్మి, పెంట శ్రీనివాసరావు, పెంట సత్యంనాయుడు , ఎంపిటిసి యాల్ల అరుణ కుమారి, ఈఓపిఆర్డీ వర్మ, ఆర్ ఐ శ్రీనివాసరావు,ఎంఈఓలు సూరి దేముడు,వెంకటరమణ, హౌసింగ్ ఏఈ జానకీరాం,నాయకులు పోల ఈశ్వర నారాయణ, తెంటు వెంకటఅప్పల నాయుడు, ఏగిరెడ్డి గోపాలనాయుడు,
సెక్రటరీలు, విఆర్ ఓ లు,సచివాలయం ఉద్యోగులు, అంగన్వాడి సిబ్బంది, వైద్య సిబ్బంది,నాలుగుపంచాయతీల వాలంటీర్లు, సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు, స్థానిక ప్రజలు, లబ్దిదారులు పాల్గొన్నారు. ధృవీకరణ పత్రాలు తీసుకున్న లబ్దిదారులు థాంక్స్ సీఎం అని కృతజ్ఞతలు తెలిపారు.