ముంబయి: ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి సంస్థ గోద్రెజ్ గ్రూప్. ఈ గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ గోద్రెజ్ అండ్ బోయ్స్, డబ్ల్యుడబ్ల్యుఎఫ్-ఇండియా (ప్రకృతి కోసం ప్రపంచవ్యాప్త నిధి -ఇండియా) సహకారంతో ఇవాళ ‘‘మ్యాజికల్ మడ అడవులు’’ పరిరక్షణకు సంబంధించి అవగాహన ప్రచారం ఫేజ్-4ను ప్రకటించింది. గతంలో అంటే 2020లో మొదటగా దీన్ని ప్రారంభించారు. తద్వారా 200 కంటే ఎక్కువ మంది వాలంటీర్లకు శిక్షణను ఇచ్చారు. వీరంతా భారతదేశంలోని తీరప్రాంతం కలిగిన 7 రాష్ట్రాలలో 27000 మందికి పైగా పౌరులకు మడ అడవుల గొప్పదనం, వాటిని కాపాడుకోవాల్సిన అవసరంలో అవగాహన కల్పించారు. అంతేకాకుండా, గత మూడేళ్లలో నేపథ్య సోషల్ మీడియా పోస్ట్ల ద్వారా మిలియన్ల మంది భారతీయులకు చేరువయ్యేలా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార ముఖ్య లక్షణాలు వాలంటీర్ల సామర్థ్యాన్ని పెంపొందించడం, శిక్షణ పొందిన వాలంటీర్ల ద్వారా ఔట్రీచ్, అవగాహన, నిపుణుల చర్చల ద్వారా జ్ఞానాన్ని పెంపొందించడం, పోటీలు, బలమైన సోషల్ మీడియా ప్రచారం.