విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని పాండురంగ స్వామి దేవస్థానం ఎదురుగా ఎన్టీఆర్, వైయస్సార్ విగ్రహాల పక్కన ఆగస్టు 2న బుధవారం రక్తదాన శిబిరమును, శ్రీ చౌడేశ్వరి దేవి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజర్ బీరే శ్రీరాములు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం వారు మాట్లాడుతూ ఈ శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశంలో గర్భవతులను, తల సేమియా బాధితులను రక్తదానం ద్వారా ఆదుకొనుటే మా లక్ష్యం అని తెలిపారు. రక్తదానం ఇవ్వడం వలన మరో ఇరువురు ప్రాణాలు మనము కాపాడిన వారము అవుతామని తెలిపారు. నేడు గర్భవతులకు, తల సేమియా బాధితులు గాని రక్తం ఎంతో అవసరం ఉందని తెలిపారు. రక్తదానం చేసి, ప్రాణదాతలు కావాలని వారు కోరారు. మీరు ఇచ్చే ఒక చిన్న రక్తపు బొట్టు ఒక నిండు ప్రాణమును కాపాడుతుందని, మీతో పాటు మీ బంధువులకు, స్నేహితులకు రక్తదానంపై అవగాహన కల్పించాలని వారు తెలిపారు. రక్తం ఇచ్చిన దాతలకు శ్రీ చౌడేశ్వరి సేవా సమితి తరపున సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు. అన్ని దానాల కన్నా రక్తదానం నిన్న అని, రక్తము ఇచ్చిన దాతల రుణములు కూడా తీర్చుకోలేనిదని, అది దైవసహాయంగా భావించాలని తెలిపారు. రక్త దాతలు ఇచ్చే ప్రతి రక్తపు బిందువు ఎంతో అమూల్యమైనదని వారు తెలిపారు. కావున ఆసక్తిగల రక్త దాతలు సెల్ నెంబర్ 7330800483 కు సమాచారాన్ని అందించి, తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.