విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ నియోజకవర్గంలో ఆగస్ట్ 3వ తేదీన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ఖరారైంది ఆయన పర్యటన కియా పరిశ్రమ ,గొల్లపల్లి రిజర్వాయర్ ను ,సందర్శించునున్నరు. పర్యటన సందర్భంగా గొల్లపల్లి రిజర్వాయర్ వద్ద సభా వేదిక,పైలాన్ రూట్ మ్యాప్ ను టూర్ ప్రోగ్రాం కమిటీ నాయకులు రవిబాబుతో కలిసి పరిశీలించిన నియోజకవర్గ ఇన్చార్జి బికె పార్థసారథి పర్యటనలు విజయవంతం చేయాలని రాయలసీమలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెండింగ్ ప్రాజెక్టులో పూర్తి చేయకుండా రైతులకు ద్రోహం చేస్తున్నాడని ప్రభుత్వ వైఫల్యం ఎండ కట్టడానికి ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.