విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని మున్సిపల్ కార్యాలయమునకు వైస్ చైర్మన్-2 గా ఇటీవలే షేక్ శంషాద్ బేగం నియామకమయ్యారు. ఈ సందర్భంగా గురువారం పురపాలక సంఘ కార్యాలయంలో వారి గదిలో పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, మున్సిపల్ చైర్మన్ కాచర్ల లక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్-1 వేముల జయరాం రెడ్డి, వార్డ్ కౌన్సిలర్లు, పురపాలక సంఘం ఉద్యోగులు, యువర్ ఫౌండేషన్ అధ్యక్ష కార్యదర్శులు వై కే శ్రీనివాసులు, శుంకు సుకుమార్, సభ్యులు డాక్టర్ సుబ్బారావు, శీల నాగేంద్ర, బండి నాగేంద్ర, పోలా ప్రభాకర్, వైయస్సార్సీపి నాయకుడు చాంద్ బాషా లు శుభాకాంక్షలు తెలియజేశారు. తదుపరి షేక్ శంషాద్ బేగం మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి తన వంతుగా నిరంతరం కృషి చేస్తానని, ప్రజల సమస్యలను పరిష్కరించుటలో కూడా పరిష్కార దిశగా తాను కృషి చేస్తానని తెలిపారు.