సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్
విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : ఎంపీ ఆర్ డ్యామ్ కింద జీడిపల్లి రిజర్వాయర్ దగ్గర ఉన్న 55 వేల ఎకరాలను వెంటనే సాగులోకి తీసుకురావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జాఫర్ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్లో స్పందన కార్యక్రమంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఉరవకొండ నియోజకవర్గ పీఏ బిఆర్ కింద కుడి, ఎడమ ప్రాజెక్టులకు దానిపైన, ఎన్టీఆర్ డ్యామ్ కింద జీడిపల్లి రిజర్వాయర్ దగ్గరలో 55,000 ఎకరాలు సాగులోకి వచ్చిందన్నారు. 2017 అప్పటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ద్వారా 899.60 మంజూరు చేయించిందన్నారు. ఆముదాల గ్రామంలో డ్రిప్ ఇరిగేషన్ కోసం బిందు సేద్యం సంబంధించిన మెటీరియల్ మూల పడిందన్నారు. గత ఆరు సంవత్సరాలుగా ఎటువంటి ఉపయోగం లేకుండా ద్రోహం చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 899.60 కోట్లను వెంటనే మంజూరు చేసి 55 వేల ఎకరాల భూమిని యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు. తుంగభద్ర హంద్రీనీవా కాలువ ఆయకట్టు నీరు ఇవ్వాలన్నారు. తుంగభద్ర అంత చెత్త చెదారంతో నిండిపోయింది అన్నారు . అందరిని మా దగ్గర ఉన్న మూల్యు నుంచి మచి మళ్లు నుంచి కూడా ఎత్తిపోయడానికి అవకాశం ఉందన్నారు. చలివేముల కుడేరు మండలంలో సర్వే నెంబర్ 1188 భూమిలో తాసిల్దార్ ఆ భూములను పేదలకు ఇవ్వాలన్నారు. భూమిలోకి ఎవరు పోకూడదు అని బోర్డు పెట్టడం జరిగిందన్నారు. ఇటువంటి బోర్డులను లెక్క చేయమని ఇళ్ల స్థలాలు ఇచ్చేంతవరకు ఉద్యమం చేస్తామన్నారు. స్థానిక సోమనాథ్ నగర్ లో ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగి రామాంజనేయులు ఈ రోజున రోడ్డు గడ్డంగా బండలు పాతించడం జరిగిందన్నారు. ఈ విషయమే అధికారుల దృష్టికి తీసుకు పోవడం జరిగిందని వెంటనే అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సహాయ కార్యదర్శి చిరుతల మల్లికార్జున, జిల్లా కార్యవర్గ సభ్యులు బి కేశవరెడ్డి, ఉరవకోశీడ నియోజకవర్గ కార్యదర్శికార్యదర్శి మల్లికార్జున, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి. రామకృష్ణ, టీ.సీ నారాయణస్వామి, బి.రమణయ్య ఉరవ కొండనియోజకవర్గ సహాయ కార్యదర్శి మనోహర్,గూడూరు మండల పార్టీ కార్యదర్శులు నారాయణమ్మ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి చెన్నప్ప యాదవ్, నీళ్ల పాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.