రోటరీ క్లబ్ ప్రతినిధులు
విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఈనెల 13వ తేదీ ఆదివారం ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు జయసింహ, కార్యదర్శి నాగభూషణ, కోశాధికారి సుదర్శన్ గుప్తా, క్యాంపు చైర్మన్ నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సాంస్కృతిక మండలిలో సోమవారం శిబిరం యొక్క కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కంటి ఆపరేషన్తో పాటు వివిధ సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ శిబిరం రోటరీ క్లబ్,శంకరా కంటి ఆసుపత్రి- బెంగళూరు, జిల్లా ఆంధ్ర నివారణ సంస్థ వారి సహకారంతో నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు కలవల సుకన్య జ్ఞాపకార్థం భర్త కలవల మురళీధర్, కుమారుడు కలవల నాగతేజ,కోడలు శర్వాణి, మనవడు కలవల మీ హాను,(సుకన్య సిల్క్స్- ధర్మవరం) వ్యవహరించడం ఎంతో సంతోషదాయకమని తెలిపారు. అంతేకాకుండా ఎక్కడైనా కుటుంబ సభ్యులు ఎవరైనా మృతి చెందితే నేత్రాలు దానం చేసి రెండు జీవితాలలో వెలుగు నింపాలని తెలిపారు. కంటి పరీక్షలు ఆపరేషన్లు పేదవారికి పూర్తిగా ఆరోగ్య సేవా కార్యక్రమం కింద చేస్తున్నామని తెలిపారు. కంటి నిపుణుల సలహాలతో కళ్ళల్లో ఉచిత లెన్స్ కూడా అమర్చబడునని తెలిపారు. కంటి పరీక్షలు చేసుకొను వారు ఆధార్ కార్డు రేషన్ కార్డు లేదా ఓటర్ గుర్తింపు కార్డు తో పాటు మూడు ఫోటోలు కూడా తీసుకొని రావాలని తెలిపారు. చిన్నపిల్లలకి వికలాంగులకు తగిన ప్రాధాన్యత కూడా కల్పిస్తామని తెలిపారు. ఆపరేషన్ తో పాటు రవాణా సౌకర్యం కూడా పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్రశాల ప్రసన్నకుమార్, షోలిగాళ్ళ వెంకటేశులు, గట్టు హరినాథ్, జి.కొండయ్య తదితరులు పాల్గొన్నారు.