కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ పరిపాలన అధికారి కోటేశ్వరరావు
విశాలాంధ్ర – ధర్మవరం : పురపాలక అభివృద్ధి దిశపై అధికారులందరూ కూడా ప్రత్యేక శ్రద్ధను కనపరచాలని కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ పరిపాలన అధికారి కోటేశ్వరరావు సూచించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం మున్సిపల్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ను నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కొన్ని అంశాలపై వారు తెలిపిన విషయాలను కమిషనర్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇంటి పన్ను వసూలు, యూజర్ చార్జీలు వసూలును వేగవంతం చేయాలని తెలిపారు. మున్సిపాలిటీ అనుమతి లేకుండా అక్రమ కట్టడాలను ఎప్పటికప్పుడు గుర్తించి, కఠిన చర్యలు తీసుకొని మునిసిపల్ అభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. పట్టణాలలో భవన నిర్మాణాలు జరగాలంటే టౌన్ ప్లానింగ్ అధికారి వద్ద తప్పనిసరిగా ప్లానింగ్తో అనుమతి తీసుకోవాలని తెలిపారు. అక్రమ కట్టడాలు, రీ సర్వే, జగనన్నకు చెబుతాం, అన్న విషయాల విషయాలపై శ్రద్ధ కనబరచాలన్నారు. అదేవిధంగా కాలానుగుణంగా వచ్చే డెంగ్యూ ,మలేరియా తదితర వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలను తప్పకుండా చర్యలు చేపట్టాలన్నారు. మున్సిపల్ కార్యాలయంలో అన్ని విభాగాలలో ఎటువంటి పెండింగ్ సమస్యలు ఉండరాదని, ఎప్పటికప్పుడు పర్యవేక్షణలు విధిగా చేయాలని వారు తెలిపారు. పట్టణ పరిశుభ్రతలో కూడా తప్పనిసరిగా ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలని వారు తెలిపారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, వార్డులో చక్కటి వాతావరణం ఉండే విధంగా చూడాలని ఆరోగ్య విషయంలో పట్టణ ప్రజలకు అవగాహన తప్పనిసరిగా కల్పించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మేనేజర్ ఆనంద్ డిపిఆర్ఓ సుబ్బరాయుడు ఇంజనీరింగ్ డిఈ. వన్నూరప్ప, ఏఈ సుధారాణి తదితరులు పాల్గొన్నారు.