విశాలాంధ్ర -ధర్మవరం: పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల యందు గణిత శాస్త్రము, ఒకేషనల్ వాణిజ్య శాస్త్రము (తెలుగు, ఆంగ్ల మధ్యమములలో) బోధించుటకు అధ్యాపకులుగా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ లక్ష్మి కాంత్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ గంటకు 150 రూపాయల ప్రకారం నెలకు పదివేల రూపాయలు మించకుండా గౌరవ వేతనం ఇవ్వబడుతుందని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 14వ తేదీ లోపల బయోడేటాను కళాశాల యందు అందజేయాలని తెలిపారు. తదుపరి ఈనెల 16వ తేదీన ఇంటర్వ్యూలను నిర్వహించి నియామకములను చేపడతామని తెలిపారు. మహిళా అభ్యర్థులకు పదవీ విరమణ పొందిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసినదిగా వారు సూచించారు.