విశాలాంధ్ర- తాడిపత్రి: పట్టణంలోని రంగప్ప కాలనీలో గురువారం ఏపీ వ్యవ సాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు రంగయ్య ఆధ్వర్యంలో జిల్లా మహాసభల కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాడిపత్రి పట్టణంలో సెప్టెంబర్ నెలలో జరగబోతున్న బహిరంగ సభకు ముఖ్య అతిధులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శులు కామ్రేడ్ జెలి విల్సన్, ఆవుల శేఖర హాజరవుతారు. ఈ బహిరంగ సభలో రైతుల, రైతు కూలీల, వ్యవసాయ కూలీల సమస్యల పైన చర్చించి ఒక కార్యాచరణ రూపొందిస్తా మన్నారు. కావున గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఉన్న వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, ఉపాధి కూలీలు, కార్మిక సంఘాలు బహిరంగ సభకు తరలి వచ్చి జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమానికి సిపిఐ మండల కార్యదర్శి నాగ రంగయ్య రైతు సంఘం నాయకుడు నారాయణరెడ్డి, రామాంజి, సురేష్ పాల్గొన్నారు.