విశాలాంధ్ర -ఉరవకొండ : ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీలో 2019 సంవత్సరం నుంచి మేనేజ్మెంట్ కంటెన్సీ బిల్లులు, మరియు ఉప సర్పంచ్ కు పనులు కేటాయింపు లక్షలాది రూపాయలు నిధులు దుర్వినియోగం అయినట్లు వచ్చిన ఆరోపణలపై ఉన్నత స్థాయి అధికారులతో సమగ్ర విచారణ జరిపించాలని ఉరవకొండ మేజర్ గ్రామ పంచాయతీకి చెందిన వార్డు సభ్యులు మీనుగా రామాంజనేయులు, రవి, ముస్కెన్ సాబ్,చేజాల ప్రభాకర్, మరియు జిలాన్ భాష,కురవ రమేష్ గురువారం ఎంపీడీవో అమృత్ రాజును కలిసి వినతి పత్రాన్ని అందజేశారు.