తారక్ చేయూత ట్రస్ట్. అధ్యక్షులు..రామాంజి
విశాలాంధ్ర -ధర్మవరం : సమాజ సేవ చేయుటలోనే ఎంతో సంతృప్తి ఉందని తారక్ చేయుట ట్రస్ట్ అధ్యక్షులు రామాంజి, కార్యదర్శి నవ కుమార్, కోశాధికారి ముత్యాలు, ప్రధాన కార్యదర్శి తుకారాం తెలిపారు. ఈ సందర్భంగా గురువారం పుట్టపర్తి రోడ్డులో గల ట్రస్టు కార్యాలయంలో హెచ్ఐవి వ్యాధికి గురైన ధర్మవరం, మడకశిర ,తాడిపత్రి, అనంతపురంలో నుండి వచ్చిన 20 మందికి నిత్యావసర సరుకులతో పాటు డ్రై ఫ్రూట్స్, బ్రెడ్స్ ను పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. అనంతరం రామాంజి మాట్లాడుతూ హెచ్ఐవి వ్యాధిన పడి, తల్లిదండ్రులు లేని వారికి ఈ పౌష్టిక ఆహారంను దా త ఎర్రజోడు చంద్రశేఖర్ ద్వారా అందజేయుట మా సేవగా తాము భావిస్తున్నామని, ప్రతి ఒక్కరూ సేవా గుణమును అలవర్చుకున్నప్పుడు మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అంతేకాకుండా తారక్ చేయుట ట్రస్ట్ ద్వారా ప్రతిరోజు రాత్రిపూట అనాధలకు, పేదలకు, బిచ్చగాళ్లకు దాదాపు 100 మందికి పైగా భోజన పంపిణీ కూడా దాతల సహాయ సహకారములతో నిర్వహిస్తున్నామని తెలిపారు. కావున ప్రజలు ఒక విషయాన్ని గమనిస్తూ, తమ కుటుంబంలో ఎవరిదైనా పుట్టినరోజు వేడుకలు, వర్ధంతి వేడుకలుగాని ,వగైరా శుభకార్యాలు గాని జరిగినప్పుడు మా ట్రస్ట్ కు చేయూత నిస్తే ఎంతోమంది పేదల కడుపును నింపిన వారం అవుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సహకార దర్శి రమేష్, ఉపాధ్యక్షులు వెంకటేశు, ఉప కార్యదర్శి వేణు తోపాటు హేమంత్, గురు, దుర్గ, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.