పోస్ట్మాస్టర్ వెంకటరామిరెడ్డి
విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని కాయగూరల మార్కెట్ వీధిలో గల ప్రధాన తపాలా కార్యాలయంలో ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు త్రివర్ణ పతాకమును కేవలం 25 రూపాయలకే విక్రయిస్తున్నట్లు పోస్ట్మాస్టర్ వెంకటరామిరెడ్డి, అసిస్టెంట్ పోస్ట్మాస్టర్ వేదాంతులు గురువారం తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో గల ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ వ్యాపారస్తులు, ఈ జాతీయ పతాకమును అధిక సంఖ్యలో కొనుగోలు చేయాలని వారు తెలిపారు. అదేవిధంగా ఆగస్టు 15వ రోజు ప్రతి ఇంటి మేడపైన జాతీయ పతాకాన్ని ఎగురవేసి, భారతీయ గొప్పతనాన్ని చాటాలన్నీ తెలిపారు.