విశాలాంధ్ర-వలేటివారిపాలెం : ఆజాద్ కా అమృత మహోత్సవం భాగంగా నా భూమి -నా దేశం కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం అంకభూపాలపురం,అయ్యవారిపల్లి,శాఖవరం,పోలినేనిపాలెం,శామీర్ పాలెం,కొండారెడ్డి పాలెం గ్రామపంచాయతీ లలో చెట్లు నాటే కార్యక్రమాన్ని సర్పంచ్ లు మరియు ఎంపీటీసీ సభ్యులు ఎంపీడీఓ చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విధిగా, విరివిగా చెట్లను నాటి, వాటిని సంరక్షించాలని ప్రజలకు తెలియజేశారు. చెట్లను మనం సంరక్షిస్తే, అవి మనల్ని సంరక్షిస్తాయని , అదేవిధంగా చెట్లు పెరగడం వలన వర్షాలు ఎక్కువ పడేందుకు దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు చింతలపూడి రవీంద్ర,సర్పంచ్ లు ప్రగడ ఆదిలక్ష్మి,డేగా వెంకటేశ్వర్లు,గడ్డం భవాని,అనుమోలు అమరేశ్వరి,పులి నరసింగరావు,ఎంపీడీఓ రఫిక్ అహ్మద్,పంచాయతీ కార్యదర్శులు అనిల్ రవికుమార్,వెంకటేశ్వర్లు,కొండారెడ్డి పాలెం ప్రధానోపాధ్యాయులు మన్నం మాధవరావు,గ్రామ నాయకులు ఎల్ఐ సీ మాల్యాద్రి,కుమ్మరి మాల్యాద్రి,ప్రగడ వెంకటేశ్వర్లు,బొమ్మిరెడ్డి తిరుపతి రెడ్డి,అనుమోలు సుబ్బారావు,నవులూరి హజరత్తయ్య,వడ్లమూడి రమేష్,దివి వీరయ్య,దామా వెంకటేశ్వర్లు,మల్లయ్య,మాల్యాద్రి,గడ్డం మాధవరావు,గడ్డం శివరామయ్య, సచివాలయ సిబ్బంది,ఉపాధి హామీ పథకం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.