విశాలాంధ్ర -పెనుకొండ : పెను కొండ మండల వ్యవసాయ సలహా మండలి సమావేశము శుక్రవారం వ్యవసాయ కార్యాలయం నందు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు ఆవుటాల రమణారెడ్డి ఏ డి ఏ స్వయంప్రభ ఏ వో శంకర్ నాయక్ మండల అగ్రి చైర్మన్ కొండలరాయుడు రెవిన్యూ పట్టు పరిశ్రమ శాఖ పశుసంవర్ధక శాఖ అధికారులు మండల ఆర్బికే సిబ్బంది పాల్గొన్నారు ,అదేవిధంగా పెనుకొండ నియోజకవర్గం అగ్రి ల్యాబ్ సందర్శించడం అయినది, వారి సందర్భంగా మాట్లాడుతూ ఈ ఖరీఫ్ సీజన్లో వర్షాలు సకాలంలో రానందున ప్రత్యామ్నాయ విత్తనాలు రైతులతో వేయించాలని అలాగే రైతు లాభసాటిగా ఉండాలంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించే పంటలను వేయించాలని సేంద్రియ వ్యవసాయం వైపు రైతులను మళ్లించాలని కోరారు మన ప్రాంతానికి అవసరమైనటువంటి సెరికల్చర్ పంటలు ఉద్యానవన పంటలు ఎక్కువగా సాగు చేయించడానికి రైతులకు అవగాహన కల్పించాలని వారు కోరారు, ఈ కార్యక్రమంలో ఏ డి ఏ ల్యాబ్ ఏవోలు ఏ ఈ ఓ లు పాల్గొన్నారు.