విశాలాంధ్ర – ధర్మవరం: చంద్రబాబు తోనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని తెలుగు యువత నాయకులు పేర్కొన్నారు. ధర్మవరం రూరల్ మల్కాపురం పంచాయతీ కేంద్రం లో శుక్రవారం హిందూపురం పార్లమెంట్ తెలుగు యువత సోషల్ మీడియా కోఆర్డినేటర్ తోట వాసుదేవ, నియోజకవర్గ అధ్యక్షుడు మధుసూదన్ నాయకులు, కార్యకర్తలతో కలిసి మిషన్ రాయలసీమ పై ప్రచారాన్ని నిర్వహించారు. మిషన్ రాయలసీమ డిక్లరేషన్ కరపత్రాలను పంచుతూ ప్రచారం చేశారు.నిర్వహించారు. మిషన్ రాయలసీమ డిక్లరేషన్ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రకటించిన మిషన్ రాయలసీమతో పాటు మినీ మేనిఫెస్టోపై పోస్టర్ గురించి వివరించారు. చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని తెలిపారు. ప్రజలు టిడిపి విజయానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ తిరుమలేస్, తెలుగుయువత ఉపాధ్యక్షులు సంగాల బాలు,ఐటీడీపి నియోజకవర్గం అధ్యక్షుడు మందల సురేష్ బాబు,ఐటీడీపి టౌన్ అధ్యక్షుడు చెలిమి శివరామ్, సుధాకర్, లింగప్ప, నియోజక వర్గం కార్యదర్శి యుగంధర్, కాటమయ్య,పవన్,రమేష్,తదితరలు పాల్గొన్నారు.