మానవతా సేవా సంస్థ
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని సాయి నగర్లో గల అర్బన్ హెల్త్ సెంటర్లో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారు గర్భిణీ స్త్రీలకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు తల్లం నారాయణమూర్తి మాట్లాడుతూ ఈ సేవా కార్యక్రమానికి పి. జే. గజేంద్ర తన తల్లి జ్ఞాపకార్థం నిర్వహించినట్లు వారు తెలిపారు. తదుపరి మెడికల్ ఆఫీసర్ శ్వేత, తల్లం నారాయణమూర్తి మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు మానసికంగా ప్రశాంతంగా ఉంటూ ఆరోగ్య పరీక్షలను ఎప్పటికప్పుడు చేయించుకుంటూ జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ప్రతి గర్భిణీ కూడా ప్రభుత్వ ఆసుపత్రిలోనే సుఖ ప్రసవం చేయించుకోవాలని తెలిపారు. తదుపరి మెడికల్ ఆఫీసర్ శ్వేత మానవతా సంస్థకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి చిన్నప్ప, సహాయ కార్యదర్శి మంజునాథ్, డైరెక్టర్లు కృష్ణయ్య, చంద్రశేఖర్, బాలసుబ్రమణ్యం, కరుణాకర్, జగ్గా వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.