ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్
విశాలాంధ్ర -ఉరవకొండ : హంద్రీనీవా కాలువ నుంచి గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ కి నీటిని మళ్లించకుండా కాలయాపన చేసి జిబిసి రైతులను ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర రెడ్డి నిలువునా మోసం చేశాడని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. శుక్రవారం ఉరవకొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గుంతకల్లు బ్రాంచ్ కెనాల్ కింద 26 వేల ఎకరాలలో మిర్చి పంటను రైతుల సాగు చేశారని హెచ్ఎల్ సి కాలువకు నీరు ఆగిపోయిన తర్వాత పంటలను కాపాడుకోవడానికి హంద్రీనీవా నీటిని జి బి సి కి మళ్ళించాలని పెద్ద సంఖ్యలో రైతులు ఆందోళనలను చేపట్టినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదన్నారు. పంటలు ఎండిపోతున్నాయి నీటిని ఇవ్వాలని నేషనల్ హైవే పై నాలుగు గంటల పాటు రైతులు ఆందోళన కార్యక్రమాలు కూడా చేయడం జరిగిందని అయినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించలేదన్నారు. తాను ముఖ్యమంత్రి, రాష్ట్ర ఇంజనీరింగ్ అధికారులు,జిల్లా కలెక్టర్ తో కూడా సంప్రదింపు చేశానని హంద్రీనీవా నుంచి జిబిసి కి నీటిని అందించి పంటలను కాపాడుతామని చెప్పిన మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి పూర్తిగా వైపల్యం చెందారన్నారు. గతంలో తాము ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు నీటిని అందించి పంటలను కాపాడడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. ఈసారి కూడా తనకు అవకాశం ఇస్తే రైతుల సహకారంతో జిబిసి రైతులకు నీటిని అందించే కార్యక్రమం చేపడతానని చెప్పడం జరిగిందని అయినప్పటికీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి అడ్డుకోవడం జరిగిందన్నారు.
రైతుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో 170 క్యూసెక్కుల నీరు జిబి సి కాలువకు వెళ్లాల్సి ఉండగా నామమాత్రంగా 30 క్యూసెక్కుల నీటిని మళ్ళించారని ఈ నీరు ఒక గ్రామానికి కూడా సరిపోవున్నారు హంద్రీనీవా ప్రధాన కాలువ నుంచి జిబిసి కి నీటిని తీసుకొని వెళ్లే కాలువలో పేరకపోయిన గడ్డిని మట్టిని కూడా తొలగించకుండా నీటిని మళ్లించడం వల్ల జిబిసి కాలువకు నీరు వెళ్లడం లేదన్నారు. ఉరవకొండ మండలం వ్యాసాపురం, నింబగల్లు గ్రామాల రైతులతో సమన్వయం చేసుకొని నీటిని మళ్లించకుండా ఆ గ్రామాల రైతులతో ఘర్షణ వాతావరణని వైసిపి నాయకులు సృష్టించారని తెలిపారు హెచ్ ఎల్ సి కి నీరు ఆగిపోయిన రోజే జి బి సి కి నీటిని మళ్లించాలని రైతుల యొక్క విజ్ఞప్తిని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వేగవంతంగా నీటిని అందించడంలో ఘోరంగా విఫలం చెందారని ఆరోపించారు. విశ్వేశ్వర్ రెడ్డి నిర్లక్ష్యం కారణంగానే 26 వేల ఎకరాల్లో మిర్చి సాగు చేసిన రైతులు నష్టపోయారు అన్నారు. దీనికి పూర్తి బాధ్యత విశ్వేశ్వర రెడ్డి వహించాలన్నారు.