విశాలాంధ్ర ధర్మవరం::(శ్రీ సత్య సాయి జిల్లా) ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పిల్లల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీసేందుకు 36 అకాడమిక్, 26 సాంస్కృతిక విభాగాల్లో మొత్తం 62 ఈవెంట్లలో జరిగే 2024 అనంత బాలోత్సవం పిల్లల పండుగ ఫిబ్రవరి 5,6,7 తేదీలలో ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్, న్యూ టౌన్, అనంతపురం నందు జరిగే కార్యక్రమానికి ధర్మవరం పట్టణానికి చెందిన ఆత్మీయ ట్రస్ట్ వారు రూ.20,000 (ఇరవై వేల రూపాయలు) చెక్కును బాలోత్సవ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ వి. సావిత్రి ఆత్మీయ ట్రస్ట్ చైర్మన్ శెట్టిపి జయ చంద్రా రెడ్డి, ఆత్మీయ ట్రస్ట్ సభ్యులు రమణయ్య, భూతన్న, జస్వంత్, కృష్ణజ చేతుల మీదుగా నగదును అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అనంతరం సావిత్రి ఆత్మీయ ట్రస్ట్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.