విశాలాంధ్ర, ఎన్ పి కుంట: వేతనాలు పెంచడంతోపాటు న్యాయమైన తమ సమస్యలను పరిష్కరించలేదని అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలిలో వరుసగా 21వ రోజు అంగన్వాడి కార్యకర్తలు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఎన్నికల ముందు తెలంగాణ కంటే మన రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలకు ఒక వెయ్యి రూపాయలు జీతం అదనంగా చెల్లిస్తానని చెప్పి, కార్యకర్తలకు ఇచ్చిన మాట ను ముఖ్యమంత్రి మరిచారని వారు పేర్కొన్నారు. 21 రోజులుగా ఆందోళన చేస్తున్న కూడా ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమని వారు అభిప్రాయపడ్డారు. అంగన్వాడి సమ్మెను ప్రభుత్వం భగ్నం చేయాలని చూస్తోందని, సమస్యలను పరిష్కారం చేసేంతవరకు తమ పోరాటం కొనసాగుతుందని అంగన్వాడి సిబ్బంది పేర్కొన్నారు. కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.