విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) మాట తప్పని మడమ తిప్పని నేత మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని వైసీపీ నేత బోయ అళ్లయ్య అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కంబలదిన్నె గ్రామంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సామాజిక పింఛన్లను నెలకు 3,000 రూపాయలు పింఛన్లు ఇచ్చి చరిత్ర సృష్టించారని కొనియాడారు. నియోజకవర్గ ప్రజల వెన్నంటి ఉండి, ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి 2024 లో జరిగే ఎన్నికల్లో నాల్గోసారి విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.