పెనుకొండ ఎమ్మెల్యే సీటును శంకరన్నకు కేటాయించాలని వైసీపీ శ్రేణులు అధిష్టానానికి వినతి
విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ ఎమ్మెల్యే సీటును శంకర్ నారాయణ కు కేటాయించాలని మంగళవారం మండల పరిషత్ కార్యాలయం నందు వైసిపి శ్రేణులు పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే శంకర్ నారాయణ 2014 నుంచి పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేశారని ధర్మవరం నుంచి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని ప్రజలతో మమేకమై ప్రజల మనసు గెలుచుకొని2019 ఎన్నికలలో విజయం సాధించి వైఎస్ఆర్సిపి తరఫున ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన అనుభవం మరియు స్థానిక సంస్థల ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి దిమ్మతిరిగే విధంగా వైఎస్ఆర్సిపి పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం ఆయనకు నియోజకవర్గ వ్యాప్తంగా 250 కోట్లతో అనేక అభివృద్ధి పనులు నిర్వహించి నియోజకవర్గ వ్యాప్తంగా మంచి సత్సంబంధాలు ఉన్నాయని కావున రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇంచార్జ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మా పెనుకొండ ఎమ్మెల్యే సీటు విషయంలో అభ్యర్థి తంపై ఇతరులను కాకుండా శంకర్ నారాయణ కే ఎమ్మెల్యే సీటు కేటాయించాలని వైయస్ఆర్సీపీ శ్రేణులు పార్టీ అధిష్టానానికి విన్నవించారు. ఇంకా ఎన్నికలకు సమయం ఉన్నందున కొన్ని రోజుల్లో సమయం ఇచ్చి సర్వేలు నిర్వహించుకుని టికెట్ కేటాయించాలని అలాగే శంకర్ నారాయణ టికెట్ ఇస్తే తప్పక గెలిపించుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్ గా ఇస్తామని శంకర్ నారాయణ స్థిర రాజకీయాలు చేస్తూ మంచి వ్యక్తిత్వం గల వ్యక్తిగా గుర్తింపు పొంది ప్రజలలో మంచి ఆదరణ ఉన్న నాయకుడిగా ఉన్నాడని అటువంటి నాయకుడని మార్చడం వలన పార్టీ ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుందని కావున వైసీపీ పెద్దలు ఎమ్మెల్యే టికెట్ విషయంలో పునరాలోచించాలని స్థానికులకే కేటాయించాలని విన్నవించారు ఈ కార్యక్రమంలో కన్వీనర్ బాబు, వైసీపీ నాయకులు రామ్మోహన్ రెడ్డి, సింగల్ విండో అధ్యక్షులు సూర్యప్రకాశ్ రెడ్డి, నరసింహప్ప, కొండల రాయుడు, సర్పంచ్ ఆదినారాయణ, వైస్ ఎంపీపీ రామాంజనేయులు, ఎంపీటీసీ నారాయణస్వామి, జేఏసీ కన్వీనర్ శ్యామ నాయక్, ఆంజనేయులు ఉన్నారు