విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా):- బాబు షూరిటీ… భవిష్యత్తు గ్యారెంటీ పథకాన్ని మండలంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు వేగం పెంచారు. సార్వత్రిక ఎన్నికల సమయం సమీపిస్తున్నందున అర్హులైన ప్రతి ఒక్కరికి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పథకాలు వర్తించేలా పేర్ల నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని క్లస్టర్, బూత్ కన్వీనర్లకు తెదేపా అధిష్టానం ఆదేశాలు జారీ చేయడంతో ఆ కార్యక్రమాన్ని మండలంలో పార్టీ శ్రేణులు వేగవంతం చేశారు. ఇప్పటికే చాలా కుటుంబాలు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు కిల్లో పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో సాయి నగర్ లోని లబ్ధిదారులకు ఈ పథకం వర్తించేలా ఆ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో కార్యక్రమ వేగవంతానికి చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ అరకు పార్లమెంట్ బీసీ సెల్ లో ఉపాధ్యక్షుడు నాగభూషణం, గ్రామ కమిటీ అధ్యక్షుడు రీమల ఆనందరావు, వెంకట్, శ్రీధర్, రాము, కోటి, నాగు లబ్ధిదారిని విజయ తదితరులు పాల్గొన్నారు.