విశాలాంధ్ర ధర్మవరం:: శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం మండల పరిధిలోని నిమ్మలకుంట గ్రామములో నివసించు ఎస్. చిదంబర రావు కు డిసెంబర్ 30వ తేదీన కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని హోసూరు సిటీలో ఏసియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ అకాడమీ చైర్మన్ ఫౌండర్ చేతుల మీదుగా ఉత్తమ కళాకార అవార్డును కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా చిదంబరావు మాట్లాడుతూ పూర్వీకుల నుండి తోలుబొమ్మలాట తయారీ చేయుట, తోలుబొమ్మలాట ప్రదర్శన చిన్నతనం నుండి తాను నేర్చుకోవడం జరిగిందని తెలిపారు. నా ప్రగతిని గుర్తించి కర్ణాటక రాష్ట్రము వారు అవార్డు ప్రధానం చేయడం నాకెంతో సంతోషాన్ని కలిగించిందని, నా వృత్తికి మరింత బాధ్యత పెరిగిందని వారు తెలిపారు. తనకు మా నాన్న నారాయణప్ప తల్లి శాంతమ్మ లే గురువులని తెలిపారు. వారి యొక్క ఆశీస్సులతో తాను ఇంతవరకు 25 అవార్డులను పలు రాష్ట్రాల నుండి జిల్లాల నుండి పొందడం నా పూర్వజన్మ సుకృతం అని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం నిమ్మలకుంట గ్రామస్తులు, ధర్మవరం ప్రజలు, అధికారులు, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు చిదంబర రావు కి శుభాకాంక్షలు తెలియజేశారు.