విశాలాంధ్ర -ధర్మవరం::(శ్రీ సత్య సాయి జిల్లా) ఇటీవల హైదరాబాదులో జరిగిన కార్యక్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన శ్రీ లలిత నాట్య కళానికేతన్ నాట్యాచార్యులు బాబు బాలాజీ, వారి శిష్యులకు నాట్య సంకల్ప అవార్డులు కైవసం చేసుకోవడం జరిగింది. ముందస్తులో భాగంగా హైదరాబాదులోని బీరం కూడా గుట్టలో శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో శ్రీ వాగ్దేవి సకల సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి. నాట్యాచార్యులు బాబూ బాలాజీ కమలా బాలాజీ శిష్య బృందం రామ లాలీత్,సంస్కృతి, సాహితీ ప్రియా, ఉదయశ్రీ, మోక్షిత, యశస్వని, తరుని,ప్రణతి, యశశ్రీ, విద్యా, ఉమాదేవి, సాత్విక,యశస్వి,కీర్తన, ప్రణీత, సుదీ క్ష లు (17 మంది) నాట్యం చేసి అందర్నీ ముగ్ధుల్ని చేశారు. ఈ సంబరాల్లో ధర్మవరానికి చెందిన శ్రీ లలిత నాట్య కళానికేతన్ నాత్యాచార్యులు బాబు బాలాజీ కమలా బాలాజీ శిష్య బృందం 17 మంది ప్రతిభ కనబరిచారు. నాట్య సంకల్ప అవార్డులు, సంక్రాంతి నంది అవార్డులను సొంతం చేసుకున్నారు. తదుపరి డాన్స్ మాస్టర్ బాబు బాలాజీని సంస్థ నిర్వాహకులు నాగేంద్ర యాదవ్ ముఖ్య అతిధుల చేతుల మీదుగా నాట్య ప్రజ్ఞ అవార్డుతో ఘనంగా సత్కరించారు.