విశాలాంధ్ర – ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : గత 20 రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కొరకై సమ్మె నిర్వహిస్తున్నరు. ఈ సమ్మె ప్రారంభం నుంచి ఇప్పటివరకు మునిసిపల్, ప్రభుత్వ ఉపాధ్యాయులు అందరూ కూడా చేదోడు వాదోడుగా ఉంటూ తమదైన శైలిలో సహాయ సహకారాలను అందిస్తూ వారి సమ్మెకు మద్దతు కూడా పలకడం జరిగింది. ఇటువంటి సమ్మె సమయంలో ప్రతి ఉద్యోగి ఆర్థికంగా ఇబ్బంది పడుతాడు అన్న తలంపుతో మునిసిపల్ ఉపాధ్యాయులు రూ .27,500, రూరల్ ప్రభుత్వ ఉపాధ్యాయులు రూ .81,700 మొత్తము వెరసి రూ.1,09,200 లను ఆర్థిక సహాయం కింద పంపిణీ చేశారు. ఇటువంటి ఆర్థిక సహాయం మా కొరకు ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ కలిసికట్టుగా మాకు చేయడం ఉపాధ్యాయ కుటుంబంలో తాము కూడా సభ్యులుగా ఉన్నట్లు తాము భావిస్తూ, పేరుపేరునా మునిసిపల్, ప్రభుత్వ ఉపాధ్యాయ, ఉపాధ్యాయులకు ప్రత్యేక కృతజ్ఞతలను సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ కలిసి తెలిపారు.