విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరు గ్రామానికి చెందిన పింఛన్ దారురాలు లక్ష్మి కర్నూలులోని ఓ ఆసుపత్రిలో గుండె ఆపరేషన్ చేయించుకున్నారు. విషయం తెలుసుకున్న వాలంటీర్ జె. పి. అనిత గురువారం కర్నూలుకు వెళ్లి 3వేల రూపాయలు పింఛన్ అందించారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండడంతో ఇక్కడికే వచ్చి పింఛన్ డబ్బులు అందించడం సంతోషంగా ఉందని లక్ష్మి కుటుంబ సభ్యులు వాలంటీర్ అనితకు కృతజ్ఞతలు తెలిపారు.