సర్పంచ్ పుస్పలత, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- చెత్తను మురుగు కాలువలలో వేయొద్దని, మురుగు కాలువలలో చెత్త వేయడం వలన ఆ కాలువల గుండా పారవలసిన మురుగు నీరు ఎక్కడికక్కడ నిలిచి ఉండడంతో దోమలు వృద్ధి చెందేందుకు, తద్వారా వ్యాధులు వ్యాప్తి చెందేందుకు అవకాశం ఉన్నందున చెత్త ను మురుగు కాల్వల లోనూ, కాలువల చెంత వేయరాదని వారు సూచించారు. ప్రతీరోజు పారిశుధ్య కార్మికులు, వాహనం గ్రామంలో తిరుగుతూ అపారిశుధ్య మెరుగుకు పంచాయతీ ద్వారా కృషి చేయడం జరుగుతుందన్నారు. ప్రజలంతా సహకరించి నట్లయితే స్వచ్ఛ గ్రామంగా, పంచాయతీ గా చింతపల్లిని తీర్చిదిద్ద వచ్చన్నారు.పంచాయతీ పారిశుధ్య కార్మికులచే వీధి వీధిన మురుగు కాలువలలో పేరుకుపోయిన చెత్తను తరలించడం జరుగుతుందని, ఈ పరిస్థితిని ప్రతి ఒక్కరూ గమనించి పంచాయితీ పాలక మండలి, అధికారులు, పారిశుధ్య కార్మికులకు సహకరించాలని వారు కోరారు.