విశాలాంధ్ర -జె ఎన్ టి యుఏ: జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ప్రగతికి ఆత్మ శుద్ధితో పనిచేద్దామని ఉపకులపతి ఆచార్య జింక రంగ జనార్ధన్ పేర్కొన్నారు. శుక్రవారం నూతన పరిపాలన భవనంలోని ఆర్యభట్ట ఆడిటోరియంలో 13వ స్థాతకోస్తవ విజయోత్సవాన్ని కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఉద్యోగులను అభినందించారు. అనంతరం వీసి మాట్లాడుతూ.. ఐక్యతగా పనిచేస్తే మరెన్నో విజయ స్వప్నాలను సాధించవచ్చు అన్నారు. నాక్ విశ్వవిద్యాలయానికి ప్రామాణికం అని. బోధన, పరిశోధన, గ్రంథాలయాలు, ఆవిష్కరణలు, క్రీడలు, పరిపాలనలో నూతన ప్రగతి, మౌలిక సౌకర్యాల కల్పన మొదలైన ప్రగతిని కమిటీకి ప్రతిబింబించేలా ఉండాలన్నారు. జాతీయస్థాయిలో విశ్వవిద్యాల కీర్తికి ప్రగతికి కృషి చేసిన పాత్రికేయులను అభినందించారు. రిజిస్ట్రార్ ఆచార్య సి. శశిధర్ మాట్లాడుతూ.. ప్రణాళిక కార్యచరణ, అమలు నిర్వహణ లో ప్రతి ఉద్యోగి స్నాతకోస్తవం విజయవంతానికి చేయూతను ఇచ్చినందుకు డైరెక్టర్ల, బోధన, బోధనేతర, ఔట్సోర్సింగ్ సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పరీక్ష విభాగాధిపతి ఆచార్య కేశవరెడ్డి పరీక్ష విభాగం ఒక అమ్మాయితో పోల్చుతూ.. స్నాతకోస్తవాన్ని నిర్వహణపై చెప్పడం అందరిని నవ్విస్తూ.. అలరించింది.ఈ కార్యక్రమంలో రెక్టర్ ఆచార్య విజయ్ కుమార్, కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఎస్ సత్యనారాయణ, డైరెక్టర్లు, బోధన, బోధనేతర, ఔట్సోర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు,