తెలుగు వారందరికీ పండగ శుభాకాంక్షలు తెలిపిన జడ్పిటిసి బాలయ్య.
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- తెలుగువారి లోగిళ్ళలో పతంగుల పండుగగా చెప్పుకునే మకర సంక్రాంతి, కనుమ పర్వదిన సందడి చోటు చేసుకుంది. ప్రతి ఒక్కరి ఇళ్లలో సుఖశాంతులు, భోగభాగ్యాలు ప్రసాదించాలని జడ్పిటిసి సభ్యుడు పోతురాజు బాలయ్య అన్నారు. మంగళ వారం ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా జనవరి మాసంలో వచ్చే మకర సంక్రాంతి పర్వదినం ప్రతి తెలుగు వారిళ్లలో పతంగుల పండుగగా, పెద్ద పండుగగా పిలుచుకుంటారన్నారు. వ్యవసాయ పంటలు ఇంటికి చేరడమే గాక ఆ కుటుంబాలన్నీ భోగభాగ్యాలతో తులతూగాలనే ఉద్దేశంతో మూడు రోజులపాటు భోగి, సంక్రాంతి, కనుమ పర్వదినాలను జరుపుకోవడం జరుగుతుందని ఈ పర్వదినాలను ప్రతి కుటుంబం సుహృద్భావ వాతావరణంలో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారన్నారు. ఈ సందర్భంగా తెలుగు వారందరికీ ఆయన మకర సంక్రాంతి, కనుమ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.